పాలకొండ నగర పంచాయతీ వార్డుల సంఖ్య 28కి పెంపు: సీడీఎంఏ ఉత్తర్వులు

పాలకొండ వెబ్ న్యూస్, ఏప్రిల్ 1, 2026: పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ నగర పంచాయతీ వార్డుల పునర్విభజన ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల బలాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్ పురపాలక పరిపాలన శాఖ కమిషనర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తాజా నిర్ణయంతో పాలకొండలో ఇప్పటివరకు ఉన్న 20 వార్డుల సంఖ్య 28కి పెరిగింది. ఏపీ మున్సిపాలిటీ రూల్స్ 2004 ప్రకారం పెరిగిన జనాభా మరియు సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ మార్పులు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. (Roc.No.13032/2/2026/H1-2) నెంబరుతో విడుదలైన ఈ ప్రొసీడింగ్స్ ప్రకారం పాలకొండలో ఇకపై 28 మంది కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహించనున్నారు. వార్డుల పెంపుతో స్థానిక రాజకీయాల్లో వేడి పెరగడమే కాకుండా, ప్రజలకు పాలన మరింత చేరువవుతుందని అధికారులు భావిస్తున్నారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments