ఆ రోజు నుంచి రాము తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే నిద్రలేవడం ప్రారంభించాడు. చిన్న చిన్న పనులైనా సరే, వాటిని నిర్ణీత సమయంలో పూర్తి చేయడం అలవాటు చేసుకున్నాడు. మొదట్లో ఇది కష్టంగా అనిపించినా, నెమ్మదిగా అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అతనిలోని మార్పును చూసి ఊరి వారు కూడా అతన్ని గౌరవించడం మొదలుపెట్టారు.
అరిస్టాటిల్ అన్నట్లు గా “మనం పదే పదే చేసే పనులే మనల్ని నిర్మిస్తాయి.” అలాగే A. P. J. Abdul Kalam మాట గుర్తొచ్చింది: “కలలు నిజం కావాలంటే ముందు కృషి చేయాలి.”
"మనం పదే పదే చేసే పనుల వల్లనే మనం ఎవరో నిర్ణయించబడుతుంది. కాబట్టి విజయం అనేది ఒక పని కాదు, అదొక అలవాటు." రాము అలవాటు చేసుకున్న ఆ క్రమశిక్షణే అతన్ని గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దింది. ఎక్కడ క్రమశిక్షణ ఉంటుందో, అక్కడ అభివృద్ధి సహజంగానే ఉంటుంది. మనమూ నేటి నుంచే ఆ క్రమశిక్షణను పాటిద్దాం.
బి శివ శంకర్ ప్రసాద్
0 Comments