సిమ్ లేకపోతే వాట్సప్ బంద్

పాలకొండ వెబ్ న్యూస్, 28 ఫిబ్రవరి 2026.

 న్యూఢిల్లీ వేదికగా కమ్యూనికేషన్ యాప్స్ వినియోగదారులకు కీలక హెచ్చరిక వెలువడింది. వాట్సప్ మరియు టెలిగ్రామ్ వంటి యాప్‌లకు సంబంధించిన సిమ్ బైండింగ్ నిబంధనలు మార్చి 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారం మొబైల్‌లో సిమ్ కార్డు లేకపోతే ఈ యాప్స్ ఇకపై పనిచేయవు. గతేడాది నవంబర్‌లో ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలను ప్రకటించగా వాటి అమలుకు సంబంధించి సంస్థలకు ఇచ్చిన గడువు ఫిబ్రవరి 28తో ముగియనుంది. అంటే మరికొన్ని గంటల్లోనే ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి. దీంతో ఎవరైనా సిమ్ కార్డు లేకుండా కేవలం వైఫై ద్వారా వాట్సప్ వాడుతుంటే ఆ ఫోన్లలో యాప్ సేవలు నిలిచిపోతాయి. అంతేకాకుండా వాట్సప్ వెబ్ కూడా ప్రతి ఆరు గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా లాగౌట్ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments