పాలకొండలో ఏపిటిఎఫ్ భారీ ధర్నా..పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్

పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 27-02-2026​ఏపిటిఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపులో భాగంగా పాత తాలూకా కేంద్రమైన పాలకొండలో ఉపాధ్యాయులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సిపిఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఐఆర్ ప్రకటించాలని, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన ప్రాథమిక తరగతులను వేరు చేసి ప్రాథమిక పాఠశాలలను పునరుద్ధరించాలని కోరారు. ఉపాధ్యాయులపై పనిభారం పెంచుతున్న యాప్‌లను తగ్గించాలని కోరుతూ తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.

​ఈ కార్యక్రమంలో ఏపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మహేష్, పాలకొండ మండల అధ్యక్షులు వాసుదేవరావు, ప్రధాన కార్యదర్శి శ్రీరామ నాయుడు, సీనియర్ నాయకులు అచ్యుతరావు, వీరఘట్టం ప్రధాన కార్యదర్శి ధనుంజయ నాయుడు, జిల్లా కార్యదర్శులు బివిఏ నాయుడు, జి సూర్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు మరడాన సంపత్ కుమార్, పద్మజ, రాష్ట్ర కౌన్సిలర్ బివి రమణ పాల్గొన్నారు. వీరితో పాటు ఎన్జీఓ నాయకులు ఈశ్వరరావు, రవి, నరహరి, గౌరీశ్వరరావు, రామ్ గోపాల్, శంకరరావు, సతీష్, నాగరాజు, సింహాచలం, రామ్మోహన్, సూర్యారావు, హెడ్మాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు జామి రవి, పరంకసం నాయుడు, జయప్రదం, నాగేశ్వరరావు, నాగమణి, కృష్ణారావు, వెంకట్ నాయుడు, కామరాజు, ఉషారాణి, కృష్ణవేణి, చంద్రకళ, సిపిఐ నాయకులు తుమ్మల సూర్యారావు తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments