బ్రేకింగ్: ఏపీలో మున్సిపల్ పాలక వర్గాల గడువు ముగింపు – స్పెషల్ ఆఫీసర్ల పాలన షురూ

పాలకొండ వెబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్థానిక సంస్థల పాలనలో కీలక మార్పు చోటుచేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీల పాలక వర్గాల పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు మరియు 86 నగర పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా జీఓ జారీ చేసింది.

​ఎన్నికలు నిర్వహించి కొత్త పాలక వర్గాలు బాధ్యతలు స్వీకరించే వరకు లేదా గరిష్టంగా ఆరు నెలల పాటు ఈ స్పెషల్ ఆఫీసర్లు పరిపాలన బాధ్యతలను పర్యవేక్షించనున్నారు. నియమితులైన అధికారులు వెంటనే బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ గెజిట్‌లో ప్రచురించాలని ఉన్నతాధికారులు సూచించారు. ఇకపై నగరాలు మరియు పట్టణాల్లో ప్రజాప్రతినిధుల స్థానంలో అధికారుల పాలన కొనసాగనుంది.

Post a Comment

0 Comments